హైదరాబాద్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి ధర తగ్గిందని ఎనుమాముల మార్కెట్ లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘాల నేతలు, వ్యాపారులు మార్కెట్ కార్యదర్శితో చర్చలు జరుపుతున్నారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చామని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో రూ. 7 వేలు ధర రావడం లేదని పత్తి రైతులు తెలిపారు.