ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మహారాష్ట్ర క్యాబినెట్
ముంబై, సెప్టెంబర్ 23: మహారాష్ట్రలోని పుణె అంతర్జాతీయ విమానాశ్రయం పేరు ను మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పుణె ఎయిర్పోర్ట్ పేరును జగద్గురు తుకారాం మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు మహా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మాన ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. పౌర విమా నయాన సహాయమంత్రి మురళీధర్ మహో ల్ ఈ ప్రతి పాదన చేయగా ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.