calender_icon.png 8 October, 2024 | 5:14 PM

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

08-10-2024 11:20:20 AM

జన్నారం : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. సోమవారం జన్నారం మండలంలోని కామన్ పల్లి, పొన్కల్, తపాల్-పూర్, చింతగూడా, రొటీగూడ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రైమరి హెల్త్ సెంటర్లు,సిసి రోడ్లు, డ్రైనేజ్ల్, పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా మండల కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఎఫ్బిఓ,ఎఫ్ఎస్ఓ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో అటవి శాఖమంత్రి కొండా సురేఖ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క జిల్లాలో పర్యటిస్తారని అన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ లోని జంతువులు, చెట్లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.