calender_icon.png 5 March, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

04-03-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ శ్యామలా దేవి

ఆదిలాబాద్, మార్చి 3 (విజయక్రాంతి) : ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అధికారులను ఆదేశించారు.  స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా వివిధ సమస్యల పై ఆయా శాఖలకు సంబంధించిన అర్జీలు 64 వచ్చాయని తెలిపారు. మున్సిపల్, పంచాయితీ, విద్యా, వైద్యం, ఇరిగేషన్, రెవెన్యు, తదితర శాఖలకు సంబంధించిన అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు