23-02-2025 09:02:01 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): జిల్లా అధికారులు శాసనమండలి ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడంతో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదివారం ప్రకటించారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.