04-03-2025 12:00:00 AM
ప్రజావాణి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం, మార్చి 3 (విజయక్రాంతి) : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ముందుగా కలెక్టరేట్ లోని ప్రజావాణి దరఖాస్తుల నమోదు కంప్యూటర్ సెక్షన్ కు వెళ్లి అర్జీల నమోదును పరిశీలించారు. దరఖాస్తులను స్పష్టంగా కనపడే విధంగా స్కానింగ్ చేయాలని సూచించారు. ఈ ప్రజావాణిలో డిఆర్వో పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, తదితరులు పాల్గొన్నారు.