calender_icon.png 18 March, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

17-03-2025 08:40:42 PM

జిల్లా కలెక్టర్ అశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, సదరం సర్టిఫికెట్స్, ఫించన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణిలో (145) ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కామారెడ్డి ఆర్డీఓ వీణ,  జడ్పీ సీఈవో చందర్, పలు శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.