calender_icon.png 25 February, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

25-02-2025 12:00:00 AM

వికారాబాద్, ఫిబ్రవరి -24: ప్రజా  ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా  నాయక్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన  ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల  నుండి వచ్చిన ప్రజలు 109   పిర్యాదులు  సమర్పించారని,   వాటిలో  ధరణికి   సం బంధించిన భూ  సమస్యలు, ఆసరా  పెన్ష న్లు ,  ఇరిగేషన్ , భూ సర్వే  ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు  వచ్చాయని తెలిపారు.

మండలాలకు సంబంధించిన  పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన  భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. ఫీల్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను  పెండింగ్ ఉంచకుండా  ఎప్పటికప్పుడు  పూర్తి చేయాలనీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్తానిక సమస్తలు) సుధీర్, ఆర్‌డిఓ వాసు చంద్ర జిల్లా అధికారులు పాల్గొన్నారు.