జగదేవపూర్ (విజయక్రాంతి): కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, పిఆర్టియు టిఎస్ ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి మద్దతుగా జగదేవపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఫామ్ 19 ఓటు హక్కు ఉన్న ప్రతి ఉపాధ్యాయునికి అందజేసారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో నిరంతరము పోరాడుతూ ఎన్నో జీవో లను తీసుకొచ్చి ఉపాధ్యాయుల సంక్షేమం గురించి పాటుపడే అతిపెద్ద ఏకైక సంఘం పీఆర్టీయు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొద్దు నాయక్, సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్, నరసింహారెడ్డి, రఘురాములు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మహిళా ఉపాధ్యక్షులు అనురాధ, ఉపాధ్యాయ సోదరి, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.