calender_icon.png 19 October, 2024 | 2:02 AM

సైకోను లేడీ రిపోర్టర్స్ గెస్ చేశారు

28-07-2024 12:05:00 AM

‘ఆపరేషన్ రావణ్’ సక్సెస్ మీట్‌లో హీరో రక్షిత్ 

రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. వెంకట సత్య దర్శకత్వంలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాలో సంగీర్తన విపిన్ హీరోయిన్ కాగా, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. “ఆపరేషన్ రావణ్’కు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వస్తోంది. ‘పలాస2’ కూడా రక్షిత్ హీరోగా రూపొందిస్తాం. త్వరలో వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు. “ఇప్పటిదాకా రూరల్ క్యారెక్టర్స్‌లో కనిపించాను. ఈ సినిమాలో అర్బన్ లుక్‌లో బాగున్నాననే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. హ్యాపీగా ఉంది. మూవీలో సైకో ఎవరన్నది ఇంటర్వెల్‌లో గెస్ చేస్తే సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. కరెక్ట్‌గా గెస్ చేసిన ఇద్దరు లేడీ రిపోర్టర్స్‌కు సిల్వర్ కాయిన్ ఇవ్వటం సంతోషంగా ఉంది” అన్నారు హీరో రక్షిత్.