మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఎలక్ట్రానిక్, ఐటీ, ఇతర ఉత్పత్తుల కోసం తెలంగాణకు చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అమెరికా టెలికాం దిగ్గజం మైక్రోలింక్ నెట్వర్క్స్తో పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుందని తెలిపారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు.
ఆ పరిశ్రమలతో రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇటీవల అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యం, పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ తన సమక్షంలో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. డేటా ట్రాన్స్మిషన్, నెట్వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీలెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ గ్లోబల్ లీడర్గా ఉందని, ఇప్పుడా కంపెనీ టెక్నాలజీతో పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. సమావేశంలో పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు డెనిస్ మొటావా, సియాన్ ఫిలిప్స్, జో జోగ్భి, సుమన్ వల్లపురెడ్డి, అశోక్ పాల్గొన్నారు.