సంగారెడ్డి,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను పి ఆర్ టి యు నాయకులు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన టీఆర్టీయు నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి పట్టణంలో పీఆర్టీయు భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని సైన్స్ సెంటర్ పక్కన ప్రభుత్వం నాలుగు గంటల స్థలం కేటాయించింది అన్నారు. నిధులు మంజూరు చేసి భూమి పూజ చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.