డీజీపీని కలిసిన టీఎన్జీవో నేతలు
హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): డీజీపీ జితేందర్ను ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలంగాణ ఎన్జీ వో కేంద్ర సంఘం సభ్యులు ఆదివా రం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యో గులకు భద్రత కల్పించాలని టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ విజ్ఞప్తిచేశారు. దీనిపై డీజీపీ జితేందర్ సాను కూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉద్యోగులు పనిచేస్తారని, వారికి కావాల్సిన భద్రత కల్పించడం తమ బాధ్యత అని పేర్కొన్నట్టు టీఎన్జీవో నేతలు తెలిపారు. డీజీపీని కలిసినవారిలో టీఎన్జీవో నా యకులు సత్యనారాయణగౌడ్, శ్రీ కాంత్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ఉన్నారు.