25-04-2025 10:20:12 PM
ఎండి రజాక్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి కొత్తగూడెం ఏరియాలో ఉన్న పార్కులను, ఒక్కసారి సందర్శించి తగు సౌకర్యాలు కల్పించాలని, ఏరియా జిఎం శాలెం రాజుకు శుక్రవారం వినతి పత్రాన అందజేశారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగరేణి పార్కులకు తగిన సౌకర్యాలు కల్పించినట్లయితే సింగరేణి సంబంధిత కుటుంబాలు ఫ్రీ వెడ్డింగ్, బర్త్డే, ఫోటోషూట్స్ కొరకు అవసరమైన, లైటింగ్, తదితర ఏర్పాట్లను చేయవలసిందిగా కోరారు. అందుకు సానుకూలంగా స్పందించి పార్కులను సందర్శించి తగిన ఏర్పాట్లు చేయటానికి సంబంధిత అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటమన్నారు.