calender_icon.png 22 October, 2024 | 5:09 PM

మైదంబండ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి

22-10-2024 02:59:34 PM

మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

మంథని(విజయక్రాంతి)పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని మైదంబండ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, మంగళవారం మైదంబండ గ్రామస్తులు హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లాలన్న విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని, వెంటనే మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, మంత్రిని కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, గోదావరిఖని డిపో మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మాజీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బియ్యని శివకుమార్, మైదంబండ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బూడిది శ్రీనివాస్, రాజబాబు, మహేందర్, రాజేందర్, రాము, పాల్గొన్నారు.