calender_icon.png 6 February, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన సేవలు అందించాలి

06-02-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 5 : ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని  మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సంబం ధిత అధికారులతో కలిసి కలెక్టర్ సత్యప్ర సాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సంద ర్భంగా కలెక్టర్ ఆసుపత్రి రికార్డులను, పరిస రాలను పరిశీలించారు. ఓ పి సేవలు, ఐపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ, రికార్డ్స్ పరిశీ లించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్ట ర్ ఆదేశించారు.

రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు. సైకాలజీకి సంబంధించిన వార్డును, పిడియాట్రిక్ వార్డు, ఎమర్జెన్సీ వా ర్డు, గర్భిణీలకు సంబంధించి ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు, నార్మల్ డెలివ రీకి సంబంధించి ట్రీట్‌మెంట్ ఎలా ఇస్తున్నా రని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన త్రాగునీరు అందించా లన్నారు.

పేషెంట్లకు సరఫరా చేసే ఆహారా న్ని నాణ్యతగా అందిస్తున్నారా, లేదా పరిశీ లించారు. పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. రోగులకు అన్ని రకాల చికిత్సలకు అవసర మైన మందులు అందుబాటులో ఉంచే ఫార్మసీ పరిశీలించారు.

అనంతరం ఆసుప త్రి పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయించాలని అధికారులను ఆదే శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగ ణంలో కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల క్రిటిక ల్ కేర్ను పరిశీలించి, నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూధన్, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్’రావు, డిప్యూటీ రెసిడేంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాకూబ్’పాషా, వైద్యాధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.