calender_icon.png 24 April, 2025 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలి

24-04-2025 12:39:13 AM

  1. టీఎస్‌సీఏబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య
  2. తుర్కయంజాల్‌లో పోచంపల్లి కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభం 

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 23: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని టీఎస్‌సీఏబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య అన్నారు. పోచంపల్లి కోఆపరేటీవ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు తడక రమేష్ అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  టీఎస్‌సీఏబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరై  ఆయన మాట్లాడుతూ..  ఖా తాదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అదే విధంగా బ్యాంక్ యొక్క లావాదేవీలు, లోనింగ్ మరియు వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమం లో స్థానిక మాజీ కౌన్సిలర్ ధనరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భీమ్ రెడ్డి,  పోచంపల్లి బ్యాంక్ వైస్ చైర్మన్ రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు, బ్యాంక్ సీఈవో సీత శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.