ప్రజాపార్టీ అధ్యక్షుడు దాసరి అజయ్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): వానా కాలం పంటకు రైతు భరోసా లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం రైతాంగాన్ని మోసం చేసినట్లేనని ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మంత్రి తుమ్మల వ్యాఖ్య లకు నిరసనగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాలని శనివారం ఆయన ఓ ప్రకటనలో కోరారు.