25-04-2025 04:33:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మత్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మసీదు వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అటువంటి వారిని ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.