calender_icon.png 19 April, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై నిరసన

18-04-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 17 : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలనీ ఓపీడీఆర్ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓపీడీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేందర్ మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ప్రచారం చేసుకునేది 100 శాతం అమలు చేసేది 10 శాతం ఇది మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలలో భాగమే అని విమర్శించారు.

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ సంక్షోభాన్ని కార్మికులు ప్రజలపై, పోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వo ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలనే అమలుకు పూనుకున్నదనీ విమర్శించారు. ఈ 10 ఏండ్ల కాలంలో ఎన్ డీ ఏ సర్కారు ప్రభుత్వo పరిశ్రమల మూసివేత, వాటాల విక్రాయం, స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు లాభాలను చేకూర్చి పెట్టడమే పనిగా పెట్టుకున్నదనీ పేర్కొన్నారు.

దీనినే అభివృద్ధిగా చెప్పుకుంటునదనీ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న విధానాలన్నీ ప్రజల కోసమేని బుకాయిస్తున్నదనీ విమర్శించారు. రైల్వే, రక్షణ, బీమా విమాన సహజ వాయువు, బ్యాంకింగ్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో వాటాలు పెట్టుబడులు ఉపసంహరించుకొని విదేశీ స్వదేశీ పెట్టుబడుదారులకు అవకాశాలు కల్పిస్తున్నదినీ విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం  లాభాల్లో నడుస్తున్న కీలక రంగమైన బొగ్గు పరిశ్రమలో 100 శాతం విదేశీ స్వదేశీ పెట్టుబడుదారులకు తలుపులు తెరుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించడం దుర్మార్గమైన చర్యనీ మండి పడ్డారు. 243 బొగ్గు బ్లాకులను క్యాప్టివ్ మనిషిగా వేలం ద్వారా బడ పెట్టుబడిదారీ కంపెనీలకు అప్పగించినప్పుడు నీతులు వల్లించిన ఎన్ డి ఏ ప్రతిపక్షం ఇప్పుడు ఏకంగా 100 శాతం అంటే బొగ్గు రంగాన్ని విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు తెగ నమ్ముకునే కుట్ర తప్ప మరొకటి కాదన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. రేపు దిగిపోయేటోళ్లకు డిపెండెంట్ ఉద్యోగాలు నూతన భూగర్భ గనులు లక్ష ఉద్యోగాలు సొంత ఇంటి కల, మెడికల్ కళాశాల సర్వీస్ తో నిమిత్తం లేకుండా మెడికల్ ఇన్ వాలిడేషన్ కాంట్రాక్టు కరున రద్దు కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ హై పవర్ కమిటీ వేతనాలు ఐటి రద్దు హోల్ కారిడార్ బొగ్గు ఆదరిత పరిశ్రమలు ఇలా అనేక హామీలతో అరి చేతిలో వైకుంఠాన్ని చూపారని విమర్శించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యవసర సరుకుల ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించబోరని తగిన గుణపాఠం చెప్తారని ప్రజా స్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ కేంద్రాన్ని హెచ్చరిస్తుందన్నారు. కార్యక్రమంలో గ్రామీ ణ పేదల సంఘం  జిల్లా అధ్యక్షులు ఏన్నం శంకర్, బంక నారాయణ, వెంకటేశ్వర గౌడ్, మాణిక్, యాదగిరి, మల్లయ్య, కనకరాజు, సునీత, లలిత తదితరులు పాల్గొన్నారు.