calender_icon.png 20 April, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీనియస్​ కన్​స్ట్రక్షన్​ చేర నుంచి చెరువులను రక్షించండి

19-04-2025 11:37:06 PM

– సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య

–  సీపీఎం ఆధ్వర్యంలో ఇరిగేషన్​ డీఈ చెన్నకేశవరెడ్డి వినతి

అబ్దుల్లాపూర్​మెట్​: జీనియస్​ కన్​స్ట్రక్షన్​ చేర నుంచి ఇందిరాసాగర్​ చెరువు, వేములకత్వను రక్షించాలని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. అనాజ్​పూర్​ గ్రామ పరిధిలో ఉన్న ఇందిరాసాగర్​, వేములకత్వ ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ల సరిహద్దులను రియల్​ ఎస్టేట్​ వ్యాపార సంస్థ రోడ్డు నిర్మిస్తున్నారని.. ఆ నిర్మాణాలను అడ్డుకుని చెరువులను రక్షించాలని ఇబ్రహీంపట్నం ఇరిగేషన్​ డీఈ చెన్నకేశవరెడ్డికి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ... జీనియస్​ కన్​స్ట్రక్షన్​ చేర నుంచి ఇందిరాసాగర్​ చెరువును వేములకత్వాను రక్షించాలన్నారు.

ఇప్పటికే రామోజీ ఫిలింసిటీ యజమాన్యం వేముల కత్వ ఎఫ్​టీఎల్​లో అక్రమంగా భారీ గోడ నిర్మించారన్నారు. మరొ పక్క రియల్​ ఎస్టేట్స్​ వ్యాపారస్తులు వేముల కత్వ, ఇందిరా సాగర్​ ఎఫ్​టీఎల్​ బఫర్​ జోన్​లో పైన కొండగలు, గుట్టలు ధ్వంసం చేసి.. ఆ బండ రాళ్లు, మట్టిని చెరువులో వేసి భారీగా రోడ్డు నిర్మించారని వివరించారు. సీపీఎం పోరాట ఫలితంగా చెరువులు నుంచి మట్టిని, బండరాళ్లను తొలగించినప్పటికీ... వెంటనే సర్వే చేసి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​లను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని  కోరారు. అధికారులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వేముల కత్వ, ఇందిరా సాగర్​ సంబంధించిన ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ల ఏరియాను పారదర్శకంగా సర్వే నిర్వహించి సరిహద్దులు ఏర్పాటు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం అబ్దుల్లాపూర్​ మండల కార్యదర్శి ఏర్పుల నర్సింహా,  నాయకులు ముత్యాలు, జంగయ్య, రాములు, మహేష్​, రవి, వెంకటేశ్​, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.