25-02-2025 02:30:35 AM
మలక్పేట, ఫిబ్రవరి 24: ఆన్లైన్ బుకింగ్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, చాదర్ఘాట్ పోలీసులు రట్టు చేశారు. కోల్కతాకు చెందిన ఏడుగురు నిర్వాహకులు ఇద్దరు మహిళలతో ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేయించి, ఇద్దరు బాలికలతో చాదర్ఘాట్ మూసానగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం దాడి చేసి ఏడుగురు నిర్వాహకులను, నలుగురు మహిళలను అరెస్టు చేశారు.