calender_icon.png 26 October, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి మార్గం

16-09-2024 12:00:00 AM

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 15( విజయక్రాంతి: మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త బోధనలు ప్రపంచ శాంతికి, సోదర భావానికి, ప్రేమకు మార్గమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద సిద్ధాంతాలతో పనిచేస్తుందని పేర్కొన్నారు. దేశం, మత సామరస్యంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని తెలిపారు.