calender_icon.png 12 October, 2024 | 4:49 AM

ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

04-09-2024 12:03:55 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): వినియోగదారుల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపుతామని జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ అన్నారు. మంగళవారం ఆయన డివిజన్ 3 పరిధిలోని విజయనగర్ కాలనీ సెక్షన్ ఆఫీస్‌ను సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండ్లకు కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. పర్యటనలో సీజీఎం వినోద్ భార్గవ్, జీఎం సుబ్రహ్మణ్యం, డీజీఎం, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.