22-03-2025 01:53:31 AM
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 21(విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రగతిశీల పద్దుగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం మండలిలో బడ్జెట్పై జీవన్రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పథకాలను తాము ఆపలేదన్నారు. గొర్రెల పంపిణీ పథకాన్ని తమ సర్కారు నిలిపివేయలేదని గుర్తుచేశారు. రైతు సంక్షేమంలో దేశంలోనే ఎక్కడలేని విధంగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.