calender_icon.png 24 September, 2024 | 2:54 AM

బెంగళూరు యువతి హత్యకేసులో పురోగతి

24-09-2024 12:51:52 AM

పోలీసుల అదుపులో అనుమానితుడు

బెంగళూరు, సెప్టెంబర్ 23: కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచల నం సృష్టించిన మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యకేసులో పశ్చిమ బెంగాల్ కు చెందిన అనుమానితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ ధ్రువీకరించారు. తమ ప్రభుత్వం మహిళల భద్ర త కోసం భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. పోలీసులు త్వరలో హత్యకేసును ఛేదిస్తారని స్పష్టం చేశారు. వయ్యాలికా వల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న మహాలక్ష్మి అనే యువతిని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని 30 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. నిందితుడిని బెంగాల్‌లో గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.