11-02-2025 03:24:23 PM
మహబూబ్ కళాశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పిఎల్.శ్రీనివాస్
ముషీరాబాద్,(విజయక్రాంతి): స్వామి వివేకానంద తొలి హైదరాబాద్ సందర్శనను గుర్తు చేసుకునేందుకు శ్రీ రామకృష్ణ మాథిస్(Sri Ramakrishna Mathis)తో కలిసి ఈనెల 13న మహబూబ్ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మహబూబ్ కళాశాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పీఎల్.శ్రీనివాస్(Mahbub College Management Committee President P.L. Srinivas) పేర్కొన్నారు. సమాజానికి, యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించడానికి ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు.
ఈ మేరకు మంగళవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళాశాల ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్(Mahabub College Vice President Naresh Yadav)తో కలసి ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఫిబ్రవరి 13, 1893న మహబూబ్ కళాశాలలో అడుగుపెట్టి, ఆ అల్లకల్లోల రోజుల్లో హైదరాబాద్ పౌరులతో సంభాషించడానికి, ప్రపంచ మతాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చికాగోకు బయలుదేరే ముందు, అక్కడ ఆయన హిందుత్వంపై అసాధారణ ప్రసంగం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొంటారని తెలిపారు. స్వామి ప్రభోదానందతో పాటు శ్రీ రామకృష్ణ మఠంలోని ఇతర సీనియర్ సన్యాసులు పాల్గొంటారని తెలిపారు.