హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, దివంగత జీఎన్ సాయిబాబా సంస్మరణ సభ ఈ నెల 21న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ నున్నట్లు సివిల్ లిబర్టీస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సంఘాలు, బంధుమిత్రుల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మేధావు లు, ప్రజా సంఘాలు, హక్కుల సం ఘాల నేతలు, రచయితలు, కవులు, కళాకారులు, విప్లవ పార్టీల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.