హైదరాబాద్: ప్రముఖ నిర్మాత శివరామకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. పురావస్తు శాఖ భూ కబ్జా కేసులో నిర్మాత శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టు చేయగా ఆరోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ పై బయటకు వచ్చారు. కాగా శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు బెయిల్ రద్దు చేయటంతో శివరామకృష్ణ మళ్లీ జైలుపాలయ్యారు. శివరామకృష్ణ ముఠా రాయదుర్గంలో 84 ఎకరాల ప్రభుత్వ భూమిలో పాగా వేసినట్లు ఆరోపణలున్నాయి.