24-04-2025 06:21:43 PM
భూభారతితో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం..
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
తుంగతుర్తి (విజయక్రాంతి): గత ప్రభుత్వ ధరణి వల్ల రైతులు, అధికారులు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, ధరణి వల్ల ఎలాంటి పరిష్కారాలు జరగలేదని, అన్నదమ్ములు, అక్క చెల్లెలు భూతగాదాలు బాగా జరిగేవని, దాని వల్లనే ప్రజలు గత ప్రభుత్వాన్ని వ్యతిరేకించారని, నేడు భూభారతితో పూర్తిస్థాయిలో సమస్యలు పరిష్కారం కాగలుగుతాయని ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో భూభారతిపై అధికారులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. ధరణి వల్ల రాష్ట్ర మొత్తంలో ఒక్క కుటుంబానికి మేలు జరగలేదని తెలిపారు.
ఉగాదినాడు హుజూర్నగర్ లో సన్నబియ్యం పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలందరికీ సన్న బియ్యం అందించి ఆదుకున్నారని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 294 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థికంగా వెనకబడి ఉన్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేరువవుతుందని ఎమ్మెల్యే అన్నారు.
గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలను కష్టాల్లోకి నెట్టి వెళ్లారని ,ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రజలు తెచ్చిన ప్రభుత్వం మాదని, ఉద్యోగ విరమణ పొందిన మేధావులను, రెవెన్యూ అధికారులతో 14 నెలలు శ్రమించి భుభారతి చట్టానికి రపోదిడంజరిగిందని దీనివల్ల రైతులందరికీ న్యాయం జరుగుతుందని నమ్మకం ఏర్పడిందని, అధికారులు కూడా చట్టంతో పాటు, రూల్స్ కూడా రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
భూభారతిలో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి రెవెన్యూ అధికారులు రైతుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాలలో ఎక్కడ నలుగురు ఉన్న భూభారతి చట్టంపై చర్చ జరగాలని, పాత్రికేయ మిత్రులు కూడా భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహనపరిచేలా కథనాలు రాయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్ మాట్లాడుతూ... అధికారులు పూర్తిస్థాయిలో భూభారతి పై అవగాహన కలిగి ఉండి ,సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి తాసిల్దార్ పి దయానందం తిరుమలగిరి తాసిల్దార్ డి హరిప్రసాద్ ఎంపీడీవో సురేష్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, రామాలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, మల్లేష్ దాసరి శ్రీను, ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.