calender_icon.png 3 October, 2024 | 8:51 PM

బడ్జెట్ స్కూళ్ల సమస్యలు పరిష్కరించాలి

03-10-2024 01:25:59 AM

ముషీరాబాద్, అక్టోబర్ 2: రాష్ట్రంలోని బడ్జెట్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌ఎన్ రెడ్డి, కే అనిల్ కుమార్, కోశాధికారి కే శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల ఎన్నికైన ట్రస్మా రాష్ట్ర నూతన కార్యవర్గం బుధవారం హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మీని కలిసి బడ్జెట్ పాఠశాల సమస్యలపై విన్నవించారు.

కార్యక్రమంలో ట్రస్మా వ్యవస్థాపక గౌరవా ధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, అధికార ప్రతినిధి చింతల రాంచందర్, ముఖ్య సలహాదారు అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు పీవీ రాంనర్సయ్య, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు భానాల రాఘవ, జయరామ్ ప్రసాద్, పీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.