05-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఉపేందర్ యాదవ్ పీఎంవో శాఖ మంత్రి జితేందర్ సింగ్ ను ఎంపీలు నగేష్ ,ఈటెల రాజేందర్ తో కలసి పాల్వాయి కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశారు.ఆయా శాఖల మంత్రులకు పలు సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.