హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో రోగులకు మంచినీటి కొరత ఏర్పాడింది. మంచినీరు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులు, సహాయకులు బయట నుంచి నీళ్లు కొనుక్కుని తెచ్చుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో వెంటనే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.