calender_icon.png 29 October, 2024 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థెరిసాను గుర్తుచేసుకున్న ప్రియాంక

29-10-2024 12:42:06 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేరళలోని వయనాడ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించా రు. ఇందులో భాగంగా సోమవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ గ్లోబల్ ప్రైజ్ గ్రహీత, మానవతామూర్తి మదర్‌థెరిసాతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య అనంతరం మదర్ థెరిసా తమను పలకరించడానికి ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఆమె తమ ఇంటికి వచ్చిన సమయంలో తాను జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో థెరిసా తన దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి ఆశ్వీర్వదించారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం థెరిసా ఆహ్వానం మేరకు ఆరు సంవత్సరాల తర్వాత వారి సంస్థతో కలిసి పని చేశానన్నారు. అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు సమాజం ఏవిధంగా చేయూతనందిస్తుందో తెలిసిందన్నారు.