calender_icon.png 2 October, 2024 | 12:45 AM

డీఎస్సీలో ప్రియాంకకు 11వ ర్యాంక్

01-10-2024 12:00:00 AM

కూసుమంచి, సెప్టెంబర్ 30: ప్రభుత్వం సోమవారం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువుకు చెందిన మండవ ప్రియాంక 11వ ర్యాంక్ సాధించింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన ప్రియాంక, ఎస్వీఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఆ తర్వాత డీఎడ్, ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తి చేసింది. ప్రియాంక తండ్రి హరికృష్ణ అటవీ శాఖలో ఉద్యోగి. 

కామారెడ్డి జిల్లా టాపర్‌గా మౌనిక

కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): డీఎస్సీ కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక నిలిచింది.