13-03-2025 12:15:14 AM
గ్రామస్తులు సమాచారం ఇచ్చేంతవరకు అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ?
రేషన్ డీలర్ కుటుంబానికి మూడు అంత్యోదయ కార్డులు
ప్రభుత్వం నుంచే వచ్చాయంటూ బలవంతంగా వినియోగదారులకు విక్రయం
అదనంగా 24 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న అధికారులు
మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : కిరాణా సరుకులు కొంటేనే రేషన్ అందిస్తామని వినియోగదారులకు ఓ రేషన్ షాప్ డీలర్ అల్టిమేట్ జారీ చేశారు. రేషన్ కావాలంటే నేను చెప్పిన సరుకులు కొనుగోలు చేస్తేనే మీకు రేషన్ అందుతుందని చెప్పడంతో చేసేదేం లేక రేషన్ షాప్ డీలర్ పరిధి లో ఉన్న సదరు వినియోగదారులు ఇతర నిత్యవసర సరుకులను కొనుగోలు చేస్తూ రేషన్ తీసుకుంటున్నారంటే రేషన్ డీలర్ దౌర్జన్యo ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. వివరాల్లోకి వెళితే జడ్చర్ల మండల పరిధిలోని నర్సూర్లబాద్ గ్రామంలో ఓ రేషన్ డీలర్ బహిరంగ మార్కెట్లో ఇతర సరుకులను సరుకులను తీసుకువచ్చి ఇవి కొనుగోలు కచ్చితంగా చేయాల్సిందని చెప్పడంతో వినియోగదారులు కొనుగోలు చేస్తు న్నారు. ఈ విషయంపై గ్రామస్తులు సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టడంతో అసలు విషయాలు తెలిసాయి.
24 క్వింటాళ్ల బియ్యం అదనంగా నిల్వ
రేషన్ షాపును గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన అధికారులకు రేషన్ షాపులో 12 క్వింటాళ్ల బియ్యం ఉండవలసి ఉండగా అదనంగా 24 గంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం ఇవ్వడంతో తనిఖీ చేసిన అధికారులకు ఈ రేషన్ షాపులో అదనంగా బియ్యం లభించడం కాదు ఏ రేషన్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేసిన అదనంగా బియ్యం నిల్వ ఉంటుంన్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక్కడ ఒకచోట నిత్యం అప్పుడప్పుడు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అధికారులు చూసి చూడనట్టు వివరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండ్రు. గ్రామస్తులు ఫిర్యాదు చేస్తేనే అధికారులు తనిఖీలు చేపడతామంటే ఎలా అని పలువురు విమర్శలు తావిస్తున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?
అక్రమంగా ఇతర కిరాణా సరుకులు తీసుకువచ్చి రేషన్ షాపులోనే విక్రయిస్తున్నారు దౌర్జన్యంగా అంటే అధికారుల పర్యవేక్షణ ఏమాత్రం ఉందో ఒకసారి ఆలోచించాలి. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారు లు రేషన్ షాపులో ఇలా ఇతర సరుకులను వినియోగదారులకు అంటగడుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు. గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే అధికారులు వెళ్లి తనిఖీలు చేపడితేనే ఇలా ఉంటే నిత్యం వివిధ రేషన్ షాపుల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయే అంటూ పలువురు వినియోగ దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
డీలర్ కుటుంబంలో మూడు అంత్యోదయ కార్డులు
రేషన్ డీలర్తోపాటు వారి కుటుంబంలో మొత్తం మూడు అంత్యోదయ కార్డులు ఉన్నాయంటే ఎంత పారదర్శకంగా ప్రక్రియ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒక కార్డుకు 35 కేజీల చొప్పున 105 కిలోలు రేషన్ డీలర్ కుటుంబానికి వస్తున్నాయంటే నమ్మశక్యం కాకపోయినప్పటికీ ఇది నిజం అని అధికారులు తేల్చారు. సంబంధిత అధికారులు ఇన్నాళ్లు ఈ వ్యవహారం జరుగుతు న్న వెలుగులోకి రావడంతో ఇతర రేషన్ షాప్లపై కూడా ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. రేషన్ షాప్ తనిఖీలలో డిటి వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ఫోస్ట్మెంట్డిటి ఆదిత్య, జడ్చర్ల డిటి కిషోర్ కుమార్, ఆర్ఐ హర్షవర్ధన్ పాల్గొని ఈఈ వివరాలను వివరిం చారు. గ్రామస్తుల సమక్షంలోనే అధికారులు తనిఖీలు చెప్పటడంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.