calender_icon.png 30 September, 2024 | 2:59 PM

లగ్జరీ బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

30-09-2024 12:57:14 PM

వరంగల్‌: వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై జనగామ యశ్వంత్‌పూర్‌ సమీపంలో సోమవారం ఓ ప్రైవేట్‌ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా బస్సు టైర్‌ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం జనగాం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.