డీజీపీ జితేందర్రెడ్డి
సిద్దిపేట, అక్టోబర్ 23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో సంఘ విద్రోహ శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యమివ్వాలని డీజీపీ జితేందర్రెడ్డి సూచించారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను సందర్శించి ఆయన.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు కృషి చేయాల న్నారు. కేసులలో పారదర్శకంగా పరిశోధన చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు. అక్రమంగా మద్యం, మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠినంగా శిక్షించాలని సూచించారు. సమావేశంలో సీపీ అనురాధ, ఆదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.