- మ్యాన్హట్టన్లో పన్నెండేళ్ల తర్వాత వెలుగు చూసిన ఘటన
- న్యాయం కోసం బాధితురాలి పోరాటం
మ్యాన్హట్టన్, అక్టోబర్ 13: మ్యాన్హట్టన్ పబ్లిక్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ బ్రెట్ కిమ్మెల్ ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఘటన 12 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. బాధితురాలు తాజాగా కోర్టును ఆశ్రయిం చడంతో అమెరికాలో చర్చనీయాంశమైంది.
2012లో సదరు విద్యార్థినిని నిందితుడు న్యూడ్ కాల్స్ చేయమని బాధితురాలిని ఒత్తిడి చేసేవాడు. బాధితురాలను ఔటింగ్కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినప్పటికీ.. అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఓఈ) పర్యవేక్షణ లేకపోవడంతోనే పాఠశాలల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని నాడు బాధితురాలి సోదరి గళమెత్తింది. నిందితుడు ప్రస్తుతం మేరీల్యాండ్లో నివసిస్తున్నాడు. ఇన్నేళ్ల తర్వాత బాధితురాలు న్యాయపోరాటానికి సిద్ధమైంది. తనలాంటి అన్యాయం మరొకరికి జరగొద్దనిన్యాయస్థానాన్ని ఆశ్రయించింది.