calender_icon.png 26 October, 2024 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

01-09-2024 08:24:59 PM

ప్రిన్సిపాల్ డాక్టర్ చక్రపాణి 

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో గెస్ట్ లెక్చరర్లుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ వంగ చక్రపాణి తెలిపారు. కళాశాలలో ఇంగ్లీష్-2, తెలుగు -1, కామర్స్ -2, ఫిజిక్స్-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులతో పాటు పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పీహెచ్డీ లేనిపక్షంలో నెట్ అర్హత కలవారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నెట్ తర్వాత స్లెట్ లేదా సెట్ అర్హత గల వారిని తీసుకుంటామని స్పష్టం చేశారు. పై అర్హతలు గల అభ్యర్థులు లేని పక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% మార్కులు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

డిగ్రీ స్థాయిలో బోధన అనుభవానికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఆంగ్లమాధ్యంలో బోధించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ నెల 3వ వరకు దరఖాస్తు చేసుకోవాలని, 4న డెమో, ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రావాలని కోరారు. గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికెట్లతోపాటు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, నెట్, సెట్ తదితర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లతోపాటు ఆధార్ కార్డు, లోకల్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలని వివరించారు. ఇట్టి దరఖాస్తులను మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో ఈనెల 3వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు అందజేయాలని సూచించారు.