calender_icon.png 25 September, 2024 | 7:58 PM

విద్యార్థులపై ప్రిన్సిపాల్ బూతుల పర్వం

25-09-2024 12:58:13 AM

  1. చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ డిమాండ్
  2. నారాయణ పాఠశాల ఎదుట ఆందోళన

సూర్యాపేట, సెప్టెంబర్ 24: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ పుష్పలత నోటికొచ్చిన బూతులు తిడుతున్నదని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ నాయ కులతో కలిసి మంగళవారం పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.