01-03-2025 06:29:20 PM
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బిజెపి నాయకులు శనివారం పాలాభిషేకం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాని నరేంద్ర మోదీ మామునూరుకు ఎయిర్పోర్ట్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామోజు శ్రీనివాస్, దొంగల కొమురయ్య, పృథ్వీరాజ్, దొంగల వేణు, కంకల సదానందం, రాణా ప్రతాప్, వేముల ప్రసాద్, నవీన్ బొల్లంపల్లి, శ్యామ్, అలుగు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.