calender_icon.png 23 September, 2024 | 4:38 AM

దేశ హితమే ప్రధాని మోదీ అభిమతం

23-09-2024 02:53:03 AM

రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్

మహేశ్వరం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): దేశ హితమే ప్రధాని మోదీ అభిమతమని, ప్రతి బీజేపీ కార్యకార్త సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తాడని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు మహాయజ్ఞం లో భాగంగా ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ రంగారెడ్డి జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు యదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశం కోసమే పనిచే స్తుందన్నారు. దేశ రక్షణ కోసం కట్టుబడి ప్రధాని మోదీ శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,  నాయకులు బొక్క నరసింహా రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, తూళ్ల వీరేందర్‌గౌడ్ పాల్గొన్నారు.