12-03-2025 04:57:06 PM
జనగామ,(విజయక్రాంతి): వేసవిలో గృహ వినియోగదారులకు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఏడీఈ వేణుగోపాల్, టౌన్ 2 ఏఈ చంద్రమోహన్ తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మంగళవారం డీఈ లక్ష్మీనారాయణ(DE Lakshminarayana) ఆధ్వర్యంలో జనగామ టౌన్ 2 పరిధిలో 160 కేవీఏ సామర్థం గల మూడు ట్రాన్స్ఫార్మర్లు, 100 సామర్థ్యం గల మరో రెండు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిలో కరెంటు కోతలు లేకుండా, ఉన్న ట్రాన్స్ఫార్మర్లపై అధికార భారం పడకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.