19-04-2025 08:26:36 PM
నల్లగొండ విశ్వహిందూ పరిషత్...
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): విశ్వహిందూ పరిషత్ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. పశ్చిమబెంగాల్లో వక్ఫ్ బోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లలో హిందువులను టార్గెట్ చేస్తూ హిందువు ఇళ్లల్లోకి చొరబడి వేట కొడవళ్ళతో దాడులు చేస్తూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడు ఆస్తులను ధ్వంసం చేస్తూ హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక వారికి మద్దతిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే కలగజేసుకు ని అక్కడ హిందువులకు భద్రత కలిగించి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నల్గొండ విభాగ కార్యదర్శి గంజి సుధాకర్ , జిల్లా అధ్యక్షులు ఉమాకర్ రెడ్డి, జిల్లా సహ కార్యదర్శి జూకురి సంపత్ వర్మ జిల్లా విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు రాయల కృష్ణయ్య , జిల్లా సంఘటన మంత్రి వంశీ , జిల్లా సేవా ప్రముఖు గోవర్ధన్ , ధర్మప్రసాద్ జిల్లా ప్రముఖు కోటగిరి సంతోష్ , ధర్మాచార్య సంపర్క ప్రముఖు ప్రకాష్ బజరంగ్దళ్ సంయోజక్ నరసింహ, జిల్లా సత్సంగ్ ప్రముఖు బల్లెం యాదిగిరి, నగర ఉపాధ్యక్షుడు వెంకటయ్య, నగర సహకార దర్శి విజయ్, కేతపల్లి మండల బజరంగ్దళ్ సంయోజకు పల్స రాజుగారు నగర. సహ సంయోజక్ వెంకట్ నగర మట మందిర్ ప్రముఖు దీక్షిత్ మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.