calender_icon.png 22 September, 2024 | 7:36 AM

ఆయేషా అరెస్టుకు రంగం సిద్ధం!

22-09-2024 12:57:28 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్21: జానీ మాస్టర్ భార్య ఆయేషాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమ వుతున్నారు. ఈనేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జానీ మాస్టర్‌తోపాటు ఆమె భార్య ఆయేషా తనపై బెదిరింపులకు పాల్పడి దాడి కూడా చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కొరియో గ్రాఫర్‌పై అత్యాచారం చేయడంతో ఇప్పటికే జానీ మాస్టర్‌పై అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. రిమాండ్ రిపోర్టులో ఆయేషా దాడి చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నా రు.

ఈనేపథ్యంలో నేడోరేపో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు జానీ మాస్టర్‌ను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం దక్కకపోవడంతో నార్సింగి పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారిం చనున్నారు. ఈనేపథ్యంలో ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.