calender_icon.png 24 October, 2024 | 8:59 PM

పీఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి

13-08-2024 12:38:30 AM

పీఆర్టీయూ తెలంగాణ విజ్ఞప్తి

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పీఆర్సీ కోసం వేచి చూస్తున్నారని, వెంటనే పీఆ ర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్‌రెడ్డి, డాక్టర్ పర్వతి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు పీఆర్సీ కమిషన్ చైర్మన్ పీ శివశంకర్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించినట్టు వారు ఒక ప్రకటనలో తెలిపారు.