ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మరోసారి 'ఎక్స్'లో ప్రకాష్రాజ్ స్పందించారు. అసలు మనకేం కావాలి.. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా.. ?.. లేఖ ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యలు పరిష్కరించడమా?.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు.