calender_icon.png 23 September, 2024 | 8:07 PM

ప్రజావాణి అర్జీలు త్వరిత గతిన పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంత్ కే జండగే

23-09-2024 05:02:18 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటివరకు మన జిల్లాకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించాలని  సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులందరూ తమ పరిధిలో ఇప్పటివరకు ప్రజావాణి లో  పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. 

ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుండి  (99) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవిన్యూ శాఖ 64, జిల్లా విద్యాశాఖ 6, జిల్లా శిశు సంక్షేమ శాఖ 5, జిల్లా పంచాయతీ అధికారి 7, మున్సిపాలిటీ భువనగిరి 4, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ 3, పోలీస్ శాఖ 2, ఎంప్లాయిమెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, లీడ్ బ్యాంకు, ఏడి లాండ్ అండ్ సర్వే, గృహ నిర్మాణ, సివిల్ సప్లై, ట్రాన్స్ కో నుండి ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, కలెక్టర్ పరిపాలన అధికారి జగన్ మోహన్ ప్రసాద్ ,సుపరింటెం డెంట్ రవికుమార్,జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.