calender_icon.png 23 September, 2024 | 5:51 PM

ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి

23-09-2024 03:24:20 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 120 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు పరిశీలించి సాధ్యాసాధ్యాలను గమనించాలని కోరారు.

ప్రజలిచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంట వెంటనే ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. భూ సంబంధ వ్యక్తిగత తదితర సమస్యలపై పలు అర్జీలను తీసుకొని ఆయా శాఖల అధికారులకు పంపించారు. వచ్చిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచడం వాటి పరిష్కారం అధికారులు తీసుకున్న చర్యల గురించి సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీసీఈఓ చందర్ నాయక్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ అధికారులు వివిధ విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు.